బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 25: రైతు బీమా పథకం కింద అర్హులైన రైతులు దురదృష్టవశాత్తు మరణించినట్లయితే, ఆ సమాచారాన్ని వెంటనే వ్యవసాయ శాఖకు తెలియజేయాలని హుజురాబాద్ మండల వ్యవసాయ విస్తరణాధికారి (AEO) టి. నిఖిల్ కుమార్ గౌరవ ప్రజా ప్రతినిధులకు, రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, మరణించిన రైతుల సమాచారాన్ని అదే రోజున వ్యవసాయ శాఖకు అందించడం ద్వారా ఆ రైతు కుటుంబాలకు రైతు బీమా మొత్తాన్ని సకాలంలో అందించడంలో సహాయపడినవారు అవుతారని పేర్కొన్నారు.
రైతు సోదరులు తమ వంతు బాధ్యతగా ఈ సమాచారాన్ని అందించాలని, అలాగే ఈ విషయాన్ని తమ గ్రామ వాట్సాప్ గ్రూపులలో కూడా పోస్ట్ చేయాలని నిఖిల్ కుమార్ కోరారు. సకాలంలో సమాచారం అందించడం వల్ల రైతు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవవచ్చని ఆయన స్పష్టం చేశారు.
మరింత సమాచారం కోసం AEO నిఖిల్ కుమార్ ను 6304902163 నంబర్లో సంప్రదించవచ్చు.










