బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 09:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా వికలాంగులకు రూ. 6,000 పింఛన్ను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.
సోమవారం రోజు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం వికలాంగులకు రూ. 4,000 పింఛన్ ఇస్తున్న క్రమంలో, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అదనంగా రూ. 2,000 కలిపి రూ. 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందని వడ్లూరి గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పట్ల చిత్తశుద్ధి కలిగి రూ. 6,000 పింఛన్ను వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన నొక్కి చెప్పారు.










