నాగార్జున డెయిరీ సేవాగుణం: ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూత! మంతెన సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయం!

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూన్ 7,: హుజురాబాద్ మండలం మంతనపల్లి గ్రామానికి చెందిన మంతెన ఐలయ్య గారి కుమార్తె మంతెన సుకన్య వివాహం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నాగార్జున డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరు ప్రభాకర్ రావు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డెయిరీ తరపున సుకన్య వివాహానికి రూ. 10,116 ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా పుల్లూరు ప్రభాకర్ రావు మాట్లాడుతూ, నాగార్జున డెయిరీకి పాలు సరఫరా చేసే ప్రతి గ్రామం నుండి, ప్రతి పాడి రైతు ఆడబిడ్డ వివాహానికి డెయిరీ ద్వారా “పూస్తే మట్టెలు” బదులుగా రూ. 10,116 అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 577 మంది ఆడబిడ్డల వివాహాలకు రూ. 58,36,932 సహాయం అందించామని వివరించారు.

నాగార్జున డెయిరీ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరిస్తూ, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు, సాధారణ బీమా, ప్రమాద బీమా, లక్ష రూపాయల పశువుల బీమా, వైద్య సదుపాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నందునే పాడి రైతులు తమను కుటుంబ సభ్యులుగా భావించి తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ రంగంలో అత్యధిక పాల సేకరణ కలిగిన డెయిరీ నాగార్జున డెయిరీ అని ఆయన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్ గణేష్ రావు, డెయిరీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆకునూరి సుధాకర్, సీసీఎం మల్లారెడ్డి, సూపర్వైజర్ శ్రీధర్ రావు, స్థానిక ఏజెంట్ నరేందర్ రెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..