బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 28: శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శంకర ఐ ఫౌండేషన్, మరియు శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం జయన్న ఫౌండేషన్ సరిత – జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది.
జూన్ 4వ తేదీన ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేస్తారు.
ముఖ్యంగా, దూరదృష్టి, దగ్గరదృష్టి సమస్యలున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. అలాగే, కంటిశుక్లం (క్యాటరాక్ట్) ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి, లెన్సులు కూడా అమరుస్తారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు ప్రజలను కోరారు. మరిన్ని వివరాల కోసం 9010776119 నంబర్ను సంప్రదించవచ్చు.










