కరీంనగర్ రైతులకు తక్షణమే పచ్చిరొట్టె విత్తనాలు సరఫరా చేయాలి: తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

బాహు బలంన్యూస్ ఇల్లంతకుంట ప్రతినిధి మే 25:
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా రైతులకు జీలుగ, పెసరు వంటి పచ్చిరొట్టె ఎరువు విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సబ్సిడీపై ఈ విత్తనాలను రైతులకు అందించాలని కోరారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, పచ్చిరొట్టె ఎరువులు భూసారాన్ని పెంచి అధిక దిగుబడులకు దోహదపడతాయని రాము గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడం సరైన సమయమని ఆయన అన్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించినప్పటికీ, జూన్ నెల వస్తున్నా ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అధికారులు పచ్చిరొట్టె విత్తనాలను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి, కరీంనగర్ జిల్లా రైతులకు పచ్చిరొట్టె ఎరువుగా ఉపయోగపడే జీలుగ విత్తనాలను సత్వరమే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం తరపున రాము డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..