సైదాపూర్‌లో ట్రైనీ ఎస్సైపై దళిత, బీసీ సంఘాల తీవ్ర ఆరోపణలు – నిజనిర్ధారణకు కమిటీ ఏర్పాటు!

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి/సైదాపూర్,మే 22: సైదాపూర్ మండలంలో ప్రకంపనలు సృష్టిస్తున్న. ట్రైనీ ఎస్సై భార్గవ్, కానిస్టేబుళ్లు ఆకాష్ రెడ్డి, రవికుమార్‌లపై దళిత, బీసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. మే 8వ తేదీన లస్మన్నపల్లి గ్రామ శివారులో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో బత్తుల మహేందర్ అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలు ఇప్పుడు సైదాపూర్‌ను కుదిపేస్తున్నాయి.
కొత్త బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దళిత సంఘాలు,అంబేద్కర్ బీసీ సంఘాలు ఒక నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి,ఈ సంఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశాయి. ఈ కమిటీ వాస్తవాలను వెలికితీసి, నివేదికను ఉన్నతాధికారులకు, ఏసీబీకి, సీపీకి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌కు సమర్పిస్తామని ప్రకటించింది. ఈ నివేదికను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, గతంలో మాదిరిగా ఉద్దేశపూర్వకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకుండా, నిజానిజాలను నిగ్గు తేల్చాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం కార్యదర్శి తునికి సమ్మయ్య, నిరుద్యోగుల సంక్షేమ సంఘం ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల తిరుపతి, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పశుల స్వామి, మహాత్మ జ్యోతిరావు పూలే కమిటీ మాజీ చైర్మన్ సందేల వెంకన్న, అంబేద్కర్ సంఘం సైదాపూర్ మండల అధ్యక్షులు కలకోటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటనపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక, ఉన్నతాధికారుల స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..