హుజూరాబాద్‌లో మహిళల భాగస్వామ్యంతో ‘తెలంగాణ ఉమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమం ప్రారంభం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 22,: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ ఉమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమంలో భాగంగా, హుజూరాబాద్ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గురువారం పురపాలక సంఘ కమిషనర్ కెంసారపు సమ్మయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని ఇప్పల్ నర్సింగాపూర్, కేసీ క్యాంపు, దమ్మక్కపేట ఏరియాలలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించి, సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, పురపాలక సంఘం పరిధిలోని మహిళా సంఘాల సభ్యులందరూ ఈ స్థలాల్లో వర్షాకాలంలో మొక్కలను నాటి, జియో ట్యాగ్ ద్వారా వాటిని తప్పనిసరిగా రెండు సంవత్సరాల పాటు సంరక్షించాలని సూచించారు. మొక్కలు సక్రమంగా పెరిగేలా మహిళలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జి. సాంబరాజు, కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు జె. శ్రీకాంత్, ఎండీ. రషీద్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, మెప్మా ఏడీఎంసీ మల్లీశ్వరి, సీఎల్ఆర్‌పీలు రమాదేవి, స్వరూప, ఆర్‌పీలు, పట్టణ పరిధిలోని మహిళా సంఘాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….