బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 21:
శంకరపట్నం మండల తాసిల్దారుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన సురేఖ వాణి కి పలువురు పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు, సామాజిక కార్యకర్త మోరే గణేష్, అలాగే మావులూరి గణేష్, ఆర్.ఐ. ప్రత్యూష మేడం, సర్వేయర్ రాజేంద్రప్రసాద్, ఆర్.ఐ. బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త తాసిల్దారుగా సురేఖ వాణి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె సేవలు మండలానికి మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Post Views: 49










