బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 20; హుజురాబాద్లో ఈరోజు నిర్వహించిన తిరంగా యాత్రకు కాట్రపల్లి బీజేపీ నాయకులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దేశ గౌరవాన్ని పెంచిన సైనికులకు మద్దతుగా, ‘మనం సైతం దేశం కోసం’, ‘భారత భద్రత బలగాల వెంటే మనం’ అనే నినాదాలతో ఈ తిరంగా యాత్రను నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా, హుజురాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్రలో కాట్రపల్లి బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో విరోచిత పోరాటం చేసి దేశ రక్షణకు పాటుపడిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి సంఘీభావంగా ఈ యాత్రను నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ తిరంగా యాత్ర దేశభక్తిని చాటి చెప్పింది.
Post Views: 320










