బోల్లోజు కల్పనకు పీహెచ్‌డీ పట్టా ప్రదానం: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగుల ప్రేరణపై పరిశోధన.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్,మే 20: హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన బోల్లోజు కల్పన డాక్టరేట్ పట్టా అందుకున్నారు.హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కల్పన, కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం నుండి ఈ డాక్టరేట్‌ను పొందారు.
కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె. రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం, “ఎంప్లాయ్ మోటివేషన్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ – ఏ సెలెక్ట్ స్టడీ” అనే అంశంపై కల్పన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఈ డాక్టరేట్ లభించింది. ఆమె పరిశోధనను ఆ విభాగం ప్రొఫెసర్ (రిటైర్డ్ ప్రిన్సిపల్ సీకేఎం కాలేజ్) ఎస్. ఉపేంద్ర శాస్త్రి పర్యవేక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !