సిర్సపల్లిలో ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆటో యూనియన్ ఆర్థిక సాయం

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:మే 20: సిర్సపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కండె రాజు (30), నాగయ్య కుమారుడు, ఈ నెల మే 15న గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబానికి ఉమేష్ చంద్ర  ఆటో యూనియన్, పోతిరెడ్డిపేట రూట్ అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో యూనియన్ తరఫున రూ. 5,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎడ్ల బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర కుమార్, ఉపాధ్యక్షుడు రాగం శ్యామ్, కోశాధికారి ఎండి అమ్జద్, మాజీ అధ్యక్షులు సిహెచ్ రమేష్,కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, అర్జున్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆటో యూనియన్ చొరవను పలువురు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !