బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి:మే 20: సిర్సపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కండె రాజు (30), నాగయ్య కుమారుడు, ఈ నెల మే 15న గుండెపోటుతో మరణించగా, ఆయన కుటుంబానికి ఉమేష్ చంద్ర ఆటో యూనియన్, పోతిరెడ్డిపేట రూట్ అండగా నిలిచింది. మానవతా దృక్పథంతో యూనియన్ తరఫున రూ. 5,000 నగదుతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేసి ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఎడ్ల బిక్షపతి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర కుమార్, ఉపాధ్యక్షుడు రాగం శ్యామ్, కోశాధికారి ఎండి అమ్జద్, మాజీ అధ్యక్షులు సిహెచ్ రమేష్,కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, అర్జున్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ఆటో యూనియన్ చొరవను పలువురు అభినందించారు.

Post Views: 763










