హుజురాబాద్‌కు నూతన ఏసీపీగా మాధవి నియామకం

బాహు బలం న్యూస్ హుజురాబాద్, మే 20: హుజురాబాద్ పట్టణానికి నూతన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా వి. మాధవి నియమితులయ్యారు. గతంలో కరీంనగర్ సిసిఆర్బి ఏసీపీగా పనిచేసిన ఆమెను తాజాగా హుజురాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇంతకుముందు హుజురాబాద్ ఏసీపీగా పనిచేసిన శ్రీనివాస్‌ జీ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. నూతన ఏసీపీ మాధవి బుధవారం లేదా శుక్రవారం విధుల్లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ నియామకం హుజురాబాద్ పోలీస్ శాఖలో కొత్త మార్పులకు నాంది పలకనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !