సైదాపూర్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హుజురాబాద్ ఏసీపీకి ఫిర్యాదు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, మే 19: సైదాపూర్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమ వారం హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. మహేందర్‌పై ఎస్సై భార్గవ్ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
అనంతరం టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ కొందరు పోలీసు అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రజలకు పోలీసులు అంటే గౌరవం ఉండాలని, భయం ఉండకూడదని ఆయన అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పోలీసులు విస్మరిస్తున్నారని, నియంతల్లా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్ ఆకాశ్‌రెడ్డి, రవికుమార్‌లను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులకు స్వేచ్ఛ లేకపోవడం బాధాకరమని సంపత్ అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇలాంటి దాడులు ఎదుర్కోవాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. దళితులను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి తీవ్రంగా కొట్టడంతో మహేందర్ రెండు చెవుల కర్ణబేరులు పగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్‌కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, అతని కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై సీపీ వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితుడు బత్తుల మహేందర్‌కు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి మారపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సాగర్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.