హుజురాబాద్‌లో ఆగని కబ్జాలు – జలవనరులు ప్రమాదంలో, ముంపు భయంతో కాలనీలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 19: హుజురాబాద్ పట్టణంలో చెరువులు, కుంటలు, వాగులు, కట్టు కాలువలు గత 15 సంవత్సరాలుగా నిరాటంకంగా కబ్జాకు గురవుతున్నాయని, దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ సమ్మయ్య ముదిరాజ్ పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 2477లోని గంగోని కుంట వాస్తవ విస్తీర్ణం 12 ఎకరాల 16 గుంటలు కాగా, కబ్జాదారుల కారణంగా ప్రస్తుతం కనీసం 6 ఎకరాలు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, జమ్మికుంట రోడ్డుకు ఇరువైపులా ఉన్న మోడల్ చెరువు నుండి చంద్రవోని కుంట, గుండ్ల చెరువులకు నీటిని తీసుకెళ్లే కట్టు కాలువలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఈ విషయమై మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే వానాకాలంలో జమ్మికుంట రోడ్డులోని పలు కాలనీలు నీట మునగడం ఖాయమని సమ్మయ్య ముదిరాజ్ స్పష్టం చేశారు. నీటి ముంపు సంభవిస్తే, ఫిర్యాదులను పట్టించుకోని సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని గంగోని కుంట శిఖం భూమి, బట్టోని కుంట, కట్టు కాలువలతో పాటు వరంగల్ రోడ్డును ఆనుకుని ప్రవహించే చిలుకావాగును కూడా ఇరువైపులా కబ్జా చేసి వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సమ్మయ్య ముదిరాజ్ ఆరోపించారు. గత నెలలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, హుజురాబాద్ ఎంపీడీవోకు ఆదేశాలు అందినప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. చిలుకావాగు పక్కన యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
చెరువులు, కుంటలు, వాగులు, కట్టు కాలువల కబ్జాలపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమ్మయ్య ముదిరాజ్ ప్రశ్నించారు. వాల్టా చట్టం అమలు పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ముదిరాజ్ మహాసభ పక్షాన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఈ విషయం తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….