హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్ ఎన్నిక.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,మే 18: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ వాకర్ కొమురవెల్లి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అనంతరం జరిగిన సమావేశంలో హరిప్రసాద్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి, వాకర్ల సౌకర్యాలకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “అందరి సహాయ సహకారాలతోనే మనం ముందుకు సాగగలం. వాకర్లకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, సభ్యులందరితో చర్చించి, వారి సూచనలు, సలహాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను” అని ఆయన అన్నారు. హుజురాబాద్ పట్టణంలో వాకింగ్ చేసే వారికి మరింత ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ వాకర్లు మాట్లాడుతూ, హరిప్రసాద్ అనుభవం, నిబద్ధత అసోసియేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….