బాహు బలంన్యూస్ హుజురాబాద్,మే 18: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ వాకర్ కొమురవెల్లి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అనంతరం జరిగిన సమావేశంలో హరిప్రసాద్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి, వాకర్ల సౌకర్యాలకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “అందరి సహాయ సహకారాలతోనే మనం ముందుకు సాగగలం. వాకర్లకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, సభ్యులందరితో చర్చించి, వారి సూచనలు, సలహాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను” అని ఆయన అన్నారు. హుజురాబాద్ పట్టణంలో వాకింగ్ చేసే వారికి మరింత ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ వాకర్లు మాట్లాడుతూ, హరిప్రసాద్ అనుభవం, నిబద్ధత అసోసియేషన్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు.










