పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు: చందుపట్ల జనార్దన్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 29కి
హైదరాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ తీవ్రంగా స్పందించారు. పెన్షనర్ల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలాగే వ్యవహరించడం సరైనది కాదని ఆయన అన్నారు.
పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, జూలై 2023 నుండి నూతన పీఆర్సీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, మార్చి 2024 నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ తక్షణమే మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పెన్షనర్లు వృద్ధులని, వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేస్తూ, ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో గరిష్ట పరిమితి లేకుండా నగదు రహిత, నాణ్యమైన వైద్యం పెన్షనర్లకు అందేలా చూడాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో టా ప్ర జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు బొం గో నీ వెంకటయ్య, హుజురాబాద్ శాఖ ఉపాధ్యక్షులు చొల్లేటి మల్లారెడ్డి, దొంత హరికిషన్, కట్ట నాగభూషణాచారి, శనిగరం నరేందర్, చీకట్ల సమ్మయ్య, రావి కంటి రామకృష్ణయ్య, గౌరీశెట్టి సాంబయ్య, సయ్యద్ మునీరుద్దీన్, గరిగ చంద్రయ్య, తాటిపాముల కనుకయ్య, మండల వీరస్వామి, గాజర్ల బుచ్చిరాజం, గాజ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..