హుజురాబాద్ కోర్టులో కాంగ్రెస్ నాయకుల హాజరు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 28:
హుజురాబాద్: బి.ఆర్.ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడినందుకు తమపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం హుజురాబాద్ కోర్టుకు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు, బైండోవర్లు పెట్టడం బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అప్పటి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు కోర్టుకు హాజరయ్యారు.కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేయాలని చూసిందని, అయితే కాంగ్రెస్ నాయకులు భయపడకుండా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.కోర్టుకు హాజరైన వారిలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని అయిలయ్య, జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న, ఎండీ సలీం, ఎండీ అఫ్సర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సొల్లు బాబు, హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, అలేటి సుశీల, మహేశ్వరి, కొడెం రజిత ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !