రైతులకు భవిష్యత్తు భరోసాగా ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన సదస్సు

బాహు బలంన్యూస్ కమలాపూర్ ప్రతినిధి ఏప్రిల్ 28:
కమలాపూర్ వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూర్ రైతు వేదికలో కేన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి మధులిక, డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్, సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి, కేఎన్ బయోసైన్సెస్ జీఎం హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మధులిక మాట్లాడుతూ, ఆయిల్ పామ్ సాగు రైతులకు భవిష్యత్తులో 100% భరోసా ఇస్తుందని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
కేన్ బయో సెన్సెస్ డిస్టిక్ మేనేజర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, రైతులు మరింత విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ టన్ను ధర రూ.21,000 ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒకటి భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో, మరొకటి ఎల్కతుర్తి మండలం బావుపేట లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే ములుగులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని కూడా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
సైంటిస్ట్ రాజశేఖర్ రెడ్డి ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ తోటలకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు డ్రిప్ ద్వారా ఎరువులు అందించే విధానం గురించి వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధమైనదని, రైతులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, కేన్ బయో సైన్స్ ప్రతినిధి హేమంత్ కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్ రంజిత్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మహిపాల్, ఏఈఓ ప్రశాంత్ మరియు పలువురు ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..