బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 25: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో అమాయక హిందువులపై జరిగిన దారుణ దాడిని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హుజురాబాద్ జమ్మికుంట ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హుజురాబాద్ జమ్మికుంట ఐఎంఏ డాక్టర్లు ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. డాక్టర్లు చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరవీరులకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్ మాట్లాడుతూ,అమాయక ప్రజలపై జరిగిన ఈ దాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్,మాట్లాడుతూ, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.డాక్టర్ డాక్టర్ బండి శృతి,మాట్లాడుతూ,బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ హుజురాబాద్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ అంకం సుధాకర్, కోశాధికారి డాక్టర్ తొగరు విద్యా సాగర్,కార్యదర్శి డాక్టర్ ఉడుగుల సురేష్, వైద్యులు డాక్టర్ కృష్ణమూర్తి,డాక్టర్ నాగలింగం,డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎన్ రమేష్,డాక్టర్ బండి శృతి,డాక్టర్ కవిత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.వైద్యులంతా ఒక్కతాటిపై నిలబడి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారని ఈ ర్యాలీ ద్వారా చాటి చెప్పారు.
