చెల్పూర్ పిహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25: హుజురాబాద్ మండలం,చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ) ఆధ్వర్యం లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్క రించుకుని ఘనంగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో పిహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ మధుకర్,వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ,మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల వస్తుందని నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడం ద్వారా మరియు దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, హుజూరాబాద్‌లో కూడా ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డాక్టర్ జరీనా (మామిండ్ల వాడ) పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !