ఖండించండి! ఉగ్రవాదుల పిరికిపంద చర్య! * పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ * పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25:
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని బీజేపీ సీనియర్ నాయకులు కాశెట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ పిరికిపంద చర్యను ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… ప్రశాంతంగా ఉన్న దేశంలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇది అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. అభం శుభం తెలియని అమాయక పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలి:
ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం క్షమించరాని నేరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కాశెట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..