జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై బీజేపీ భగ్గు.. హుజూరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది.. మతం పేరుతో మారణ హోమం సృష్టించాలనుకోవడం అవివేకం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, జూన్ 13: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రమూకలు జరిపిన దాడిని ఖండిస్తూ బీజేపీ హుజూరాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కుల,మత, ప్రాంత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న భారతదేశంలో మతం పేరుతో మారణహోమం సృష్టించాలనుకోవడం అవివేకమన్నారు. పర్యాటకులను, సామాన్య ప్రజలను చుట్టుముట్టి ఆటవికంగా హత్య చేయడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు.
ఉగ్రమూకల దాడిలో ఆగిన ప్రతి ఊపిరి భారతీయుల్లో ఉద్రేకాన్ని రగిలించిందని కృష్ణారెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో మతం ముసుగులో దాడి చేసిన మతోన్మాద ఉగ్రవాదుల చర్యలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ దాడి క్రూరమైన, హేయమైన, అమానవీయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. మతం పేరుతో దాడులకు తెగబడిన ఉగ్రమూకల చెడ్డ ఉద్దేశాలు ఎప్పటికీ విజయవంతం కావని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల చర్యలకు భారత ప్రభుత్వం సరైన సమాధానం చెప్పే పనిలో ఉందని, వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, భారతదేశం ఎవరికీ తలవంచదని, ధైర్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రావుల వేణు, బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, కౌన్సిలర్ వెంకటరెడ్డి, నల్ల సుమన్, చైతన్య శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు తిప్పబత్తిని రాజు, యాంసాని శశిధర్, అంతటి వాసు, గంట సంపత్, నరాల రాజశేఖర్, కొలిపాక వెంకటేష్, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్, భూత్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..