హుజురాబాద్ 15వ వార్డు కౌన్సిలర్ బరిలో ఎరుకల సంఘం అభ్యర్థి కూతాడి కుమారస్వామి.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జనవరి 30 : మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా హుజురాబాద్ 15వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. అనాదిగా అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఎరుకల జాతి ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కూతాడి కుమారస్వామి 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ చరిత్రలో ఎరుకల సామాజిక వర్గం నుండి మొట్టమొదటిసారిగా ఒక అభ్యర్థి పోటీకి నిలవడం విశేషం.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ రాజు  మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా, ఇతర తెగలతో పోల్చుకుంటే ఎరుకల జాతి అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దాదాపు 8000 ఓట్ల బలం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశాయని విమర్శించారు. అర్హులైన తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా, ఒకే కుటుంబానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుండి చురుకైన పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు కూతాడి కుమారస్వామిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వార్డు ప్రజలపై ఉందని సంఘం నేతలు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం, ఎరుకల జాతి అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న కుమారస్వామికి 15వ వార్డు ప్రజలు, ముఖ్యంగా ఎరుకల సామాజిక వర్గ బాంధవులు అండగా నిలవాలని వారు కోరారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం, వార్డు అభివృద్ధి కోసం తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….