పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న ఇందిరాపార్క్ వద్ద ధర్నా. టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్.

bahubalamtv Reporter
bahubalamtv.in

పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న ఇందిరాపార్క్ వద్ద ధర్నా. టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 23: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) రాష్ట్ర శాఖ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షులు కట్టా నాగభూషణాచారి పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నూతన పీఆర్సీని జూలై 2023 నుండి అమలు చేసి, బకాయిల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కోరారు.
ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటిని సక్రమంగా నిర్వహించాలని, పెన్షనర్లకు నాణ్యమైన వైద్యం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డులపై గరిష్ట పరిమితి లేకుండా అన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లందరికీ ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ 20 లక్షలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టా ప్ర రాష్ట్ర శాఖ నిర్వహించనున్న ధర్నాలో రాష్ట్రం నలుమూలల నుండి పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 23: పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టా ప్ర) రాష్ట్ర శాఖ ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టా ప్ర కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవ అధ్యక్షులు కట్టా నాగభూషణాచారి పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 2024 నుండి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నూతన పీఆర్సీని జూలై 2023 నుండి అమలు చేసి, బకాయిల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కోరారు.
ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటిని సక్రమంగా నిర్వహించాలని, పెన్షనర్లకు నాణ్యమైన వైద్యం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈహెచ్ఎస్ కింద హెల్త్ కార్డులపై గరిష్ట పరిమితి లేకుండా అన్ని కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్సలు అందించాలని కోరారు. అర్హత కలిగిన ఈపీఎస్ పెన్షనర్లందరికీ ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ 20 లక్షలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యల సాధన కోసం ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టా ప్ర రాష్ట్ర శాఖ నిర్వహించనున్న ధర్నాలో రాష్ట్రం నలుమూలల నుండి పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..