బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి ఏప్రిల్ 20:
హుజురాబాద్ పట్టణంలోని కుమ్మరి వాడ అంగన్వాడీ సెంటర్ టీచర్ సంధ్య కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సంధ్య మృతితో హుజురాబాద్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె భర్త రవీందర్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
సంధ్య మరణం పట్ల హుజురాబాద్ సిడిపిఓ సుగుణ, అంగన్వాడీ టీచర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంధ్య అందరితో కలుపుగోలుగా ఉండేవారని, పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారని సహోద్యోగులు గుర్తు చేసుకున్నారు. ఆమె మృతి అంగన్వాడీ రంగానికి తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Post Views: 59










