ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు మాజీ సర్పంచ్ల సన్మానం.

బాహు బలంన్యూస్ సైదాపూర్,ప్రతినిధి:
హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులుగా నూతనంగా ఎన్నికైన సైదాపూర్ మండలానికి చెందిన కాయిత రాములు, కామని రవీందర్ లను మండలం లోని తాజా మాజీ సర్పంచ్ లు ఘనంగా సన్మానించారు. అధ్యక్ష, కార్యదర్శులను గజమాల, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ మాట్లాడుతూ..సైదాపూర్ మండలానికి చెందిన పాత్రికేయులు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికే య వృత్తిలో ప్రజా మన్ననలను పొందాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా వారు కథనాలు ప్రచురించాలని కోరారు. బడుగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. దయనీయ పరిస్థితిలో పాత్రికే వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలన్నారు. పాత్రికేయులకు సంబంధించి అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వం అందించాలన్నారు. ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు బత్తుల కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేందర్ రెడ్డి, అబ్బిడి పద్మా రవీందర్ రెడ్డి, పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్, తొంట కమల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..