బాహు బలంన్యూస్ సైదాపూర్,ప్రతినిధి:
హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులుగా నూతనంగా ఎన్నికైన సైదాపూర్ మండలానికి చెందిన కాయిత రాములు, కామని రవీందర్ లను మండలం లోని తాజా మాజీ సర్పంచ్ లు ఘనంగా సన్మానించారు. అధ్యక్ష, కార్యదర్శులను గజమాల, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ మాట్లాడుతూ..సైదాపూర్ మండలానికి చెందిన పాత్రికేయులు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికే య వృత్తిలో ప్రజా మన్ననలను పొందాలన్నారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా వారు కథనాలు ప్రచురించాలని కోరారు. బడుగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. దయనీయ పరిస్థితిలో పాత్రికే వృత్తిలో కొనసాగుతున్న పాత్రికేయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలన్నారు. పాత్రికేయులకు సంబంధించి అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వం అందించాలన్నారు. ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు బత్తుల కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, తాటిపల్లి యుగేందర్ రెడ్డి, అబ్బిడి పద్మా రవీందర్ రెడ్డి, పైడిమల్ల సుశీల తిరుపతి గౌడ్, తొంట కమల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.










