పీడర్ కాలువల ధ్వంసంఫై నీటిపారుదలశాఖ E.Eకి ఫిర్యాదు..రియాల్టర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. యువజనసమితి రాష్ట్రకార్యదర్శి మోరె గణేష్….

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామ శివారు సర్వేనెంబర్ 746ను ఆనుకొని 3 ఎల్ కెనాల్ కాలువకు సంబంధించి సర్వేనెంబర్ 753, 754, 755, 756, మరియు ఇతర సర్వే నెంబర్లు గల దళితుల ప్రభుత్వ సీలింగ్ భూములకు సాగునీరు అందే అటువంటి పీడర్ కెనాల్ కాలువలను కొందరు రియాల్టర్లు తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారని అంతేకాకుండా సర్వేనెంబర్ 746, ను ఆనుకొని జాతీయ రహదారి ఆనుకొని ఉన్నటువంటి కాలువను అక్రమంగా పూర్తిగా పూడ్చి వేయడం జరిందని
నీటిపారుదలశాఖ E. E. గారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మోరే గణేష్ నీటిపారుదలశాఖ అధికారికి వివరిస్తూ దాదాపు 45 సంవత్సరాలు గా నిరుపేద ఎస్సీ బీసీ దళితులు వందలాది మంది ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సీలింగ్ భూములను పీడర్ కాలువల ద్వారా వచ్చు సాగునీటితో పంటలు వేసుకుని జీవనోపాధి పొందేవారని అలాంటి రైతులకు నేడు సాగు నీరందక భూములు “పడావు పడి ” నిరుపేద రైతులు నాన కష్టాలు పడుతున్నారని తక్షణమే ఇట్టి విషయంపై భౌతికంగా తనిఖీ చేసి శాఖ పరమైన చర్యలు తీసుకొని అట్టి కాల్వలను పునరుద్ధరణ జరిపి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని వినితి పత్రం ద్వారా తెలియజేశారు . లేనిపక్షంలో దశలవారీగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తామని అయినా అధికారులు స్పందించినట్లయితే ఏప్రిల్ మొదటి వారంలో సంబంధిత పీడర్ కాల్వల మీద సీలింగ్ భూములలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !