మార్చి 18న కె.యు. లో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయండి . -యు జి సి నూతన ముసాయిదా- 2025 ను వ్యతిరేకిద్దాం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడుకుందాం పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్.శాతవాహన యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ వద్ద కరపత్రాలు ఆవిష్కరణ.

బాహు బలం న్యూస్ ప్రతినిధి శాతవాహన యూనివర్సిటీ
మార్చి 15;
పి.డి.ఎస్.యు. రాష్ట్ర సదస్సుకు సంబంధించిన కరపత్రాలు శాతవాహన యూనివర్సిటీ లొ ఆవిష్కరించా రు.ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల కనుసన్నాల్లో యు.జీ.సి. నూతన ముసాయిదా రూపొందించి, భారత రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో పొందుపరిచిన విద్యారంగాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని విద్య రంగాన్ని పూర్తిగా కాషాయీకరించడమే కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగించే కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని,వైస్ ఛాన్సలర్ ల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వల హక్కులను కాలరాసే యూజీసీ నూతన ముసాయిదాను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత 13 సంవత్సరాలుగా యూనివర్సిటీలో శాశ్వత ప్రతిపాదికన టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విశ్వవిద్యాలయాల విద్య వ్యవస్థ నిర్వహణ అగమ్య గోచరంగా తయారైందన్నారు.నాణ్యమైన బోధన, పరిశోధనల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయించకపోవడంతో విశ్వవిద్యాలయాలు తీవ్ర సంక్షోభంలో కోరుకుపోయి మూసివేత దిశగాపయనిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్చి 18న కేయూ లో నిర్వహించే యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య, దేశంలోని వివిధ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి నాయకులు లక్ష్మిరాజన్ ,కిరణ్, నాగరాజు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !