బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
అమ్మ లేకుంటే జననం లేదు,భార్య లేకుంటే జన్మకు అర్థం లేదు,అమ్మను పూజించు,భార్యను ప్రేమించు, ప్రాణం పోసే దేవుడు కూడా కనబడకుండా ఉంటాడమే కాని ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చిన తల్లి మాత్రం తన ప్రాణం ఉన్నంతవరకు బిడ్డ కోసం తపిస్తూనే ఉంటుంది, సృష్టికి ప్రతిసృష్టి నిచ్చి సమాజాల దిశ నిర్దేశం చేసే వారే మహిళా మూర్తులు అని ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే ఇంటి ఇల్లాలైన ప్రతి మహిళ ఆర్ధికంగా బలపడి, ముఖంలో చిరు నవ్వుతో సమాజంలో గౌరవంగా బ్రతకాలని అన్నారు. మహిళా సాధికారత కోసం అహర్నిశలు కష్టపడుదాం.
మహిళా మణులందరికీ ప్రజాసంఘాల సమాఖ్య తరపున ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .
Post Views: 206










