ప్రముఖ కవి, కైతికాల సృష్టి కర్త గోస్కుల రమేష్ కు ఘన సన్మానం.

బాహుబలం న్యూస్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి. హుజురాబాద్ ఫిబ్రవరి 21: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మాతృభాషా దినోత్స వం, కవితారచన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. జి సుహాసిని అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలుగు భాష మధురమైన భాష అని, కవితా రచన ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కు చెందిన ప్రముఖ కవి, కైతికాల సృష్టి కర్త గోస్కుల రమేష్ విచ్చేసి తెలుగు కవితా రచన ప్రాధాన్యతను, కవితా రచన మెళకువల ను తెలియజేస్తూ తాను రాసిన అనేక కవితలను వివరించారు. విద్యార్థులకు నూతన కవితా ప్రక్రియ కైతికాల గురించి తెలియజేస్తూ కైతికాల లక్షణాలు వివరించారు. కార్యక్రమ నిర్వాహకు లు, తెలుగు విభాగాధిపతి ఎస్. మధు కార్యక్ర మం యొక్క ఉద్దేశ్యాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తూ మాతృభాష దినోత్సవం రోజున తెలుగు కవితా రచన కార్యశాల నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కవితా రచన సృజనాత్మకత ప్రతిభను పెంపొందిస్తుందని అన్నారు. తెలుగు విభాగ అధ్యాపకులు మధు, లక్ష్మీకాంతం, రత్నమాల, సునీత సభలో శ్రావ్యంగా కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థుల చేత కవితలు రాయించారు. వారి చేత కవితా పఠనం చేయించారు.ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తదనంతరం కవి గోస్కుల రమేష్ ను శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. సురేష్ బాబు,అకడమిక్ కో ఆర్డినేటర్ డా.ఎం అరుణ, అధ్యాపకులు డా. లక్ష్మీ కాంతం, రామా రత్నమాల, డా.సునీత, మమత, రాజేశ్వరి, డా.సామ్యూల్, ప్రవీణ్ కుమార్, డా.సారంగపాణి, ప్రశాంతి, సుజాత, సువర్ణ, ఉదయశ్రీ, రాజిరెడ్డి, రాంరెడ్డి, రమేష్ కుమార్, మరియు భోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరాటం. మద్దతు ప్రకటించిన రాష్ట్ర మహిళా సంఘాలు; 8 వేల మందితో హాజరవుతామని వెల్లడి. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

ధాన్యపు కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం: విలవిలలాడుతున్న అన్నదాతలు – తరుగు పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల కోత విధిస్తూ నిలువు దోపిడీ – మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజం.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.