ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయడం లేదు.. -మద్యం సిండికేట్ పై ఫిర్యాదు.. -ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ /జనవరి 31:
మా ఇల్లు మాకు కావాలంటూ హుజరాబాద్ జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం కి ఐదో రోజుకు చేరుకున్నాయి.ఇందులో భాగంగా హుజురాబాద్ మునిసి పల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో హుజు రాబాద్ ప్రెస్ క్లబ్ కో కన్వీనర్ కాయిత రాములు మాట్లాడు తూ గత ఐదు రోజులుగా నివేశన స్థలాల సమస్యపై నిరస న కార్యక్రమాలు చేపట్టినప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిం చడం లేదని,ఇకపై కాంగ్రెస్ వార్తలు రాయకుండా ఉండాల ని ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు.20 సంవ త్సరాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని సాధించుకున్న ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నాయకుడు కేసు వేసినప్పటికీ దానిని ఉపసంహరించడంలో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధు జర్నలిస్టుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆలాగే హుజురాబాద్ ప్రాం తంలో మద్యం మాఫియా సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా సిట్టింగ్ లను ఏర్పాటు చేస్తుంద న్నారు.అదేవిధంగా పెద్ద మొత్తం లో డబ్బులు దండుకొని బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు.ఈ అక్రమ దందాను అరికట్టాలని ఎక్సైజ్ సిఐ కార్యాలయం లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మద్యం సిండికేట్ దందా పై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఉంటుందని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో టీయూడబ్ల్యూ జే(ఐజేయు) జిల్లా నాయకు లు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సుద్,చిలుకమరి సత్యరాజ్,బొడ్డు శ్రీనివా స్,జర్నలిస్టులు ఆంజనేయస్వామి,కిరణ్ కుమార్,నరసిం హారెడ్డి,కేదాశి శ్రీధర్,కామిని రవీందర్,పిల్లల సతీష్,మాచ ర్ల  రాజు,సమ్మెట సతీష్,ముష్కి శ్రీనివాస్ చిర్ర సుదర్శన్ గౌడ్,తిరుపతి కేషబోయిన స్వామి, చందు,టేకుల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !