మహాత్ముని ఆశయాలు అనుసరణీయం.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జనవరి 30: అహింసా, శాంతి యుత సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు మనమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్ చౌరస్థాలోని మహాత్ముని విగ్రహానికి పోలాడి రామా రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ శాంతి,అహింసా,సత్యా గ్రహం అనే ఆయుధాలతో దేశ స్వాతంత్రం కోసం మన జాతిపిత మహాత్మాగాంధీ గారు లాలా లజపతిరాయి,బిపిన్ చంద్రపాల్,బాల గంగాధర తిలక్,భగత్ సింగ్,ఆజాద్ చంద్రశేఖర్,గోపాల కృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్,పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్,లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహ నాయకులతో కలిసి మహోద్యమాన్ని నడిపించి బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆగస్ట్ 15,1947 సం. లో మన దేశానికి స్వాతంత్య్రం సిద్దింప చేశారని రామారావు అన్నారు.మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ త్యాగధను లందరికీ జోహార్లు అర్పిస్తూ దేశ సమైక్యతకు మన మందరం పాటు పడాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….