బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్ జనవరి 30: అహింసా, శాంతి యుత సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు మనమందరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.మహాత్మా గాంధి వర్ధంతి సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంపూర్ చౌరస్థాలోని మహాత్ముని విగ్రహానికి పోలాడి రామా రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ శాంతి,అహింసా,సత్యా గ్రహం అనే ఆయుధాలతో దేశ స్వాతంత్రం కోసం మన జాతిపిత మహాత్మాగాంధీ గారు లాలా లజపతిరాయి,బిపిన్ చంద్రపాల్,బాల గంగాధర తిలక్,భగత్ సింగ్,ఆజాద్ చంద్రశేఖర్,గోపాల కృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్,పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్,లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎందరో మహ నాయకులతో కలిసి మహోద్యమాన్ని నడిపించి బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆగస్ట్ 15,1947 సం. లో మన దేశానికి స్వాతంత్య్రం సిద్దింప చేశారని రామారావు అన్నారు.మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతూ త్యాగధను లందరికీ జోహార్లు అర్పిస్తూ దేశ సమైక్యతకు మన మందరం పాటు పడాలని పోలాడి రామారావు పిలుపు నిచ్చారు.










