బాహుబలం న్యూస్ హుజురాబాద్ జనవరి 02:
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన మైస
సమ్మయ్య (47) అనే భవన నిర్మాణ మేస్త్రి గుండెపోటుతో బుదవారం రాత్రి అకాల మృతి చెందారు.ఈయనకు భార్య ఇద్దరు కుమార్తెలు,ఇద్దరు కుమారులు కలరు.ఈయన
గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ మేస్త్రి గా పని చేస్తూ అందరి మన్నలు పొందారు.ఈయన పార్ధవ దేహాన్ని కాట్రపల్లి ఎస్సీ కాలనీ నుంచి తీన్మార్ వాయిద్యాలతో, బాణా సంచాలతో ఊరు బయట నిర్మించిన స్మశాన వాటిక వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంత్యక్రియలు నిర్వ హించారు. ఈయన అకాల మృతి పట్ల తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్ పార్ధువ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు.అనం తరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓదార్చారు.
Post Views: 68










