సిరిసేడులో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

సిరిసేడులో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

బాహు బలం న్యూస్, హుజురాబాద్, డిసెంబర్ 08: జమ్మికుంట పరిధి ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆద్యాంతం ఆకట్టుకుంది. SSC 2003-04 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటీ జ్ఞాపకాలు పంచుకు న్నారు. బాల్య మిత్రులతో అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ స్కూల్ ఆవరణలో కలియతిరుగుతూ ముచ్చటించారు. 20 సంవత్సరాల తర్వాత అందరూ ఒక్కచోట కలవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తంచేశారు. తదనంతరం ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలకు, సిరిసేడు గ్రామానికి ఉన్న తమ అనుబంధా న్ని నెమరువేసుకున్నారు. ఈ నేపద్యంలో 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలను పదవ తరగతికి అప్-గ్రేడ్ చేయడానికి కృషిచేసిన మాజీ సర్పంచ్, తెలంగాణ సమయం తెలుగు దినపత్రిక ఎడిటర్ శ్రీ దిడ్డి శ్రీనివాస్ గారిని, ఎలబద్రి లింగయ్య తదితరులను గుర్తుచేసుకున్నా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అప్పటి హెచ్ఎం మదునయ్య, లక్షయ్య, చంద్రహరి, మంగళంపల్లి సంపత్, వేణు, సర్వొత్తం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య హర్షం వ్యక్తంచేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి నిర్వాహకులుగా ఎండీ నయీం పాషా, ఏలేటి సురేందర్ రెడ్డి, కలాలు వేంకటేష్, భోగం స్వర్ణలత, కొక్కుల నాగ రాజు, కొక్కుల సత్య, బూర్ల రాజు, చేవుల అయిలయ్య, గణపతి రాజ్, రమేష్ తదితరుల విద్యార్థులు కృషి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !