అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ .రైతు, ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ డిసెంబర్ 06:
ధర్మశాస్త్రపండిమడిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజకీయ నాయకునిగా, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి గా, స్వాతం త్ర్యోద్యము దళిత నాయకునిగా, వృత్తి రీత్యా న్యాయవాదిగా, అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ ఆని రైతు, ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హుజురాబాద్ బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యంలోనే అడుగడుగునా బాధలకు,అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.సమాజంలో కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపు మాపడానికి, అందరికీ సమాన హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని పోలాడి రామారావు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ భారత తొలి న్యాయ శాఖా మంత్రిగా, సాంఘిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ రూప శిల్పిగా, భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజా స్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం ఆయన అన్నారు. సామాజిక న్యాయం కోసం, అందరికీ సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడిన ప్రపంచం మెచ్చే దిగ్గజ నాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమాన హక్కుల కోసం పోరాడాలని రామారావు పిలుపునిచ్చారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….