ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

సబ్బుని వెంకటస్వామి బహుబలం న్యూస్ ప్రతినిధి.

సైదాపూర్ డిసెంబర్ 04: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధి కారి కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే దివ్యాంగుల విద్యా ర్థులకు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిలు గా మండల తాసిల్దార్ దూలం మంజుల,ఎంపీడీఓ బి.యాదగిరి,లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.దివ్యాంగులకు అన్ని విధాల చేయూత అందించాలని జిల్లా సమగ్ర శిక్షా విద్యాశాఖ తరుపున 21 రకాల దివ్యాంగులకు అందిస్తున్న సదుపాయాలు,పధకాలు,సమ్మిళిత విద్యా తోడ్పాటుకు భవిత కేంద్రాలు, పాఠశాలలు అందిస్తున్న సేవలు తెలియజేశారు.వివిధ ఆటల పోటిలలో గెలుపొందిన దివ్యాంగ బాలబాలికలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఒ.కె.రవీంద్ర చారి , కాంప్లెక్స్ హెచ్ఎంలు పి దేవేందర్ రెడ్డి,ఎల్.సత్యనారాయణ దివ్యాంగుల బాలబాలికలు,వారి తల్లి తండ్రులు,మండల ఐ.ఈ.అర్.పి.బి.వెంకటేష్,సి ఆర్ పి లు శ్రీనివాస్ రెడ్డి, చక్రపాణి యం.ఆర్.సి ఎంఆర్సి సిబ్బంది పాల్గోన్నారు.



Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….