బహుబలం న్యూస్ సైదాపూర్ నవంబర్ 26:
భారత రాజ్యాంగాన్ని రాసి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం ఘనపూర్ లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలందరి మధ్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానత్వం,సాధించడం కోసం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు
Post Views: 103










