మా తండ్రి గారి స్థిరాస్తి నా సగభాగం నాకు ఇప్పించండి .కలెక్టర్ కు ఫిర్యాదు. డి ఎల్ పి ఓ ద్వారా విచారణ.

బహుబలం న్యూస్ ప్రతినిధి సైదాపూర్
నవంబర్ 12: సైదాపూర్ మండలం వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు మా తండ్రిగారి పేరుమీద గల స్థిరాస్తి ఇంటి నెంబర్ 1-110 నెంబర్ గల ఇల్లు కలదని దానిని గ్రామపంచాయతీ అధికారులు నాకు తెలియకుండా నాకు చెందవలసినటువంటి నా సగభాగము ను గుర్రం కౌసల్య,భర్త మొండయ్య పేరున మార్పిడి చేసినారు.పలుమార్లు గ్రామపంచాయతీ సెక్రటరీ విన్నవించిన కూడా పట్టించుకోలేదని అట్టి దానిని నా సగభాగము నా పేరు మీద మార్పిడి చేయవలసినదిగా కోరుతూ,కలెక్టర్ కు గుర్రం తిరుపతయ్య వినతిపత్రం ఇవ్వడం జరిగినది.దానిని అనుసరించి దానిపై విచారణ అధికారిగా హుజురాబాద్ డిఎల్పిఓ విచారణకు నోటీసు జారీ చేస్తూ 2024 నవంబర్ 12 మంగళవారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో విచారణకు హాజరు కావాలని కోరినారు.గుర్రం తిరుపతయ్య గ్రామపంచాయతీ ఆవరణలో హుజురాబాద్ డి ఎల్ పి ఓ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని మా తండ్రి గారి స్థిరాస్తి ఇల్లు 1-110 గల ఇల్లును అక్రమముగా వెన్కే పల్లి గ్రామపంచాయతీ అధికారులు నా సగభాగమును నాకు తెలియ కుండా ఇల్లును మార్పిడి చేసినారు కావున నా సగభాగమును నాకు ఇప్పించగలరని, ఈ కాగితాల ప్రకారముగా అమలు ఏమీ జరగలేదనీ గుర్రం తిరుపతయ్య, తన వాంగ్మూలన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !