సమాచార చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిది అధికారులు ఏ సమాచారాన్ని అయినా విధిగా ప్రజలకు ఇవ్వాల్సిందే సమాచార కమిషనర్లను వెంటనే నియమించాలి..యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీ ఐ తెలంగాణ కంపియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి .

బాహుబలం న్యూస్ హుజురాబాద్ అక్టోబర్ 17:
సమాచార చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదని యునైటెడ్ ఫోరం పర్ ఆర్టీ ఐ తెలంగాణ కంపియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామి రెడ్డి అన్నారు. గురువారం యునైటెడ్ ఫోరం  పర్ ఆర్టీ ఐ తెలంగాణ కంపియన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో సద్వినియం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఏ విభాగంలోనైనా అన్యాయం జరిగితే దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ పొందే వీలు ఉంటుందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరణ అడిగినప్పుడు అధికారులు స్పందించి వెంటనే దానికి సంబంధించిన వివరణ పత్రాలు విధిగా అందించాలన్నారు. సమాచార హక్కు చట్టం కింద అధికారులు వివరణ ఇవ్వకపోతే వారిపై చట్టపరమైన చర్యలకు కూడా వెళ్ళవచ్చు అన్నారు. గత పాలనలో సమాచార కమిషనర్లను నియమించలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార కమిషనర్లను వెంటనే నియమించాలని అన్నారు. కొన్ని వేల సంఖ్యలో సమాచార హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తులు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలంటే సమాచార కమిషనర్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా గతంలో మాదిరిగానే పదవ తరగతి సమాచార హక్కు చట్టం పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో యునైటెడ్ ఫోరం పర్ ఆర్టీ ఐ తెలంగాణ కంపియన్ కమిటీ సభ్యులు సిహెచ్ జనార్ధన్, బండి లక్ష్మ రెడ్డి, నలుగురు మొగిలయ్య పోలేపాక విల్సన్, కంకణాల జనార్ధన్, తులసి లక్ష్మీమూర్తి, ఇల్లందుల సమ్మయ్య, వెంకన్న, శ్రీకాంత్ రాజేశం, స్వామి తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..