తిప్పారపు సంపత్ పై కుట్ర మేడారం టీవీ పరకాల సమ్మయ్య గౌడ్ అరెస్ట్. నన్ను రాజకీయంగా దెబ్బ తీయడం కోసమే కుట్ర మాట్లాడిన వ్యక్తి కుట్రలు చేసిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలి -తిప్పారపు సంపత్ టీపీసీసీ ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జి

సబ్బని వెంకటస్వామి బహుబలంప్రతినిధి హుజురాబాద్
సెప్టెంబర్ 15:
ఆదివారం రోజున హుజరాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీస్ రాష్ట్ర ఇంచార్జ్ మాట్లాడుతూ నాగార్జున పాల డైరీలో పాల పొడితో పాలు తయారు చేస్తున్నారు అని అధికారులకు ఫిర్యాదు చేయగా నాపై కుట్ర చేస్తూ నా అనుచరుడు 15 లక్షల రూపాయలు అడిగినట్టు ఒక ఆడియో రికార్డు రిలీజ్ చేశారు ఆ కేసులో నాగార్జున పాల డైరీ యజమాని పుల్లూరి ప్రభాకర్ రావు తో 15 లక్షల రూపాయలు అడిగి మాట్లాడిన వ్యక్తి ని అరెస్టు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి పోలీసులు నిన్న మేడారం యూట్యూబ్ ఛానల్ పరకాల సమ్మయ్య గౌడ్ అరెస్టు చేయడం జరిగింది. పోలీసులు 15 లక్షల రూపాయలు అడిగింది నా అనుచరుడు కాదని నేను డబ్బులు అడగలేదని నాపై పరకాల సమ్మయ్య గౌడ్ తదితరులు కుట్ర చేశారని పోలీసులు విచారణలో నిగ్గు తేల్చారు. నాలాంటి దళిత నాయకుడిపై ఇలా కుట్రలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నాం.సమాజంలో ప్రశ్నించడమే నేరమైతే గతంలో కూడా ఈటల రాజేందర్ ప్రశ్నించినందుకు అనేక అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టడం జరిగింది. మళ్లీ ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ప్రశ్నించడంతో మళ్లీ నాపై కుట్రలు మొదలైనాయి ఇలా అయితే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే భయం లో దళితులు ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొంటున్నాం. నాగార్జున పాల డైరీ విషయంలో పోలీసులు నిజాలు తీర్చడం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను కానీ దాని వెనకాల ఇంకా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను తప్పు చేయలేదని నేను నాగార్జున డైరీ యజమాని డబ్బులు అడగలేదని నమ్మి నా పక్షాన ఉద్యమం చేసిన దళిత సంఘాలకు, ప్రజాసంఘాలకు, రిటైర్డ్ సిఐ భూమయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకనుండి నాపై ఎవరు కుట్ర చేసినా సహించేది లేదని మా ఓపికను పరీక్షించవద్దని దళితులు కన్నెర్ర చేస్తే ఏ ఒక్కరూ గ్రామాలలో తిరగరని కొంతమంది కుట్ర చేసే నాయకులకు హెచ్చరిస్తున్నాను. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మల్లయ్య,సాయి అరుణ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..