కమలాపూర్ ఎంజేపీలో బస చేసిన కలెక్టర్.

బాహుబలం న్యూస్ కమలాపూర్ సెప్టెంబర్ 13: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం రాత్రి బస చేశారు.ప్రభుత్వ ఆదేశా ల మేరకు నెలలో గురుకుల పాఠశాల లేదా హాస్టల్ లో ఒక రాత్రి బస కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల,కళాశాలకు కలెక్టర్ రాగా ఏన్ సి సి విద్యార్థినులు,బ్యాండ్ బృందం ఘనంగా స్వాగతం పలికారు. తరగతి గదులు,బాలికల డార్నెటీ.కిచెన్,స్టోర్ రూమ్. పాఠశాల పరిసరాలను తిరిగి కలెక్టర్ పరిశీలించా రు. విద్యార్థినులతో’కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కమలాపూర్ ఎంజేపీ లో విద్యార్థినులతో కలిసి రాత్రి బస చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ట్లు పేర్కొన్నారు.విద్యార్థినులతో మాట్లాడి రాత్రి నిద్ర చేయ నున్నట్లు తెలిపారు.ఉదయం విద్యార్థినులతో కలిసి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలోని డార్నెటీ లోవిద్యార్థినులు, ఉపాధ్యాయినీల తో కలిసి కలెక్ట ర్ రాత్రి బస చేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ వాసంతి, హన్మకొండ ఆర్డీవో వెంకటేష్,ఎంజెపి ఆర్సివో రాజ్ కుమార్, ప్రిన్సిపల్ సౌజన్య,తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….