హుజురాబాద్ సెప్టెంబర్ 13,( బాహు బలం న్యూస్ ): హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ లోనీ ఏకదంతా యూత్ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో శుక్ర వారం రోజున ఉదయం మహిళా మణులు ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు.సాయంత్రం భరత నాట్యం డాన్స్ నిర్వచించారు.ఏకదంతా యూత్ ఆధ్వర్యంలో ప్రతిఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగానిర్వహించి వివిధ రకాల పూజ కార్యక్రమాలను నిర్వహించి ప్రాణికోటి సుభిక్షంగా ఉండాలని,వానలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహిళా మణులు కుంకుమ పూజలు నిర్వహించి ఆ బొజ్జ గణపయ్యను వేడుకున్నారు.భక్తులకు KR టైలర్ బిక్షపతి- శ్రీలత,అన్నదాన కార్యక్రమము నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఏకదంతా యూత్ నిర్వాహకుల తో పాటు మహిళా మణులు,భక్తులు పాల్గొన్నారు.


Post Views: 154










