టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

బాహు బలం న్యూస్,హుజురాబాద్ సెప్టెంబర్ 9: నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా హుజు రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు గూడూరి స్వామిరెడ్డి,చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేల్ల మహేందర్ గౌడ్, రమేష్ లు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి సన్మానించారు. అలాగే హైదరాబాద్ లో నూతనoగా వ్యవసాయ కమిష న్ చైర్మన్ గా నియమితులైన ఎం కోదండరెడ్డిని కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని దానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావడమే ఉదాహరణ అని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !