కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక “చలో కరీంనగర్”సభను విజయవంతం చేయండి. శనిగరపు వెంకటేష్ ఉమ్మడిజిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి. శనిగరపు స్వరూప ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.

బాహు బలం న్యూస్ హుజురాబాద్ సెప్టెంబర్ 08:కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక చలో కరీంనగర్ 10 సెప్టెంబర్ 2024 మంగళ వారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ లోని పద్మనగర్ ఇందిరా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరుగుసభను విజయ వంతం చేయాలని శనిగరపు వెంకటేష్ ఉమ్మడిజిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శనిగరపు స్వరూప జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు మాదిగ సోదర సోదరీమణులను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.మాదిగలకు జనాభా దామాషా ప్రకా రం 12 % శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సెప్టెంబ ర్ 10న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ పై సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులు గా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హ .ప్రభుత్వ విప్,ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, గౌరవ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య,వేముల వీరేశం, మందుల సామెల్,తోట లక్ష్మీ కాంతారావు,మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,తదిత రులు మాదిగ రాష్ట్ర,జిల్లా, నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొనే ఈ సదస్సును విజయవంతం చేయాలని వారు కోరారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !