సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలో వినాయక చవితి రోజు తీవ్ర విషాదం జరిగింది.పండుగ ఉత్సహంలో ఉన్న యువకుడు వినాయక మండపంలో లైట్ బిగిస్తుండగా షాక్ కు గురై మృతి చెందాడు.సిర్సపల్లి గ్రామంలో శనివారం ఉదయం జరిగిన ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.సిర్సపల్లి గ్రామానికి చెందిన వంగ వెంకటేష్- లావణ్యలకు యశ్వంత్ ఏకైక కుమారుడు.వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపంలో బల్బు బిగిస్తుండగా బల్బు పగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి గమనించి యశ్వంత్ నువెంటనే హుజురాబాద్ లొని ప్రభుత్వఆసుపత్రికి తీసుకెళ్లాడు.కానీ అప్పటికే యశ్వంత్ మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. పండుగ రోజే ఈ సంఘటన జరగడంతో సిర్సపల్లి గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమ య్యారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ గౌడ్ కేసు నమోదు చేసుకున్నారు.











