బుడగ జంగాల స్మశాన వాటిక మంజూరు చేయించాల్సిందిగా ఎంపికి వినతి

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 27:
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ని కలిసి హుజురాబాద్ 23వ వార్డు బేడ బుడగ జంగాల స్మశాన వాటికను మంజూరు చేయించాల్సిందిగా ఆయనకి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్ల నుండి స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని సిరిపాటి వేణు వివరించారు. దీంతో ఈటెల రాజేందర్ స్పందించి సకాలంలో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారా శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుకుర్తి రాజేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గోదారి కొమురయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !