బుడగ జంగాల స్మశాన వాటిక మంజూరు చేయించాల్సిందిగా ఎంపికి వినతి

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 27:
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ని కలిసి హుజురాబాద్ 23వ వార్డు బేడ బుడగ జంగాల స్మశాన వాటికను మంజూరు చేయించాల్సిందిగా ఆయనకి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్ల నుండి స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని సిరిపాటి వేణు వివరించారు. దీంతో ఈటెల రాజేందర్ స్పందించి సకాలంలో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారా శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుకుర్తి రాజేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గోదారి కొమురయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….