బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 27:హన్మకొండ లో ఏర్పాటైన లెట్స్ సింగ్ టుగెదర్ సంగీత సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సోమ వారం రోజున కే ఎస్ ఎం గార్డెన్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 50 మంది గాయకులతో సంగీత విభావరి కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సంస్థ అధ్యక్షులు పుల్లా సన్నీ కార్యక్రమాన్ని నిర్వహించగా జస్పాల్ సింగ్,రాజు, హరిందర్ సింగ్,పాండు తో పాటు గాయని గాయకులు పాల్గొన్నారు. వ్యాఖ్యతలుగా సగంటి మంజుల,తొగరు శ్రీనివాస్ వ్యవహరిం చగా సాంబయ్య ఇంస్ట్రుమెంటల్ సంగీతాన్ని మరొక స్థాయి కి తీసుకెళ్ళారు.అనంతరం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జ్ఞాపిక అందించారు.
Post Views: 100










