సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ ఆగస్టు 20: అదివారం రోజున ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షు లు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు శాసనసభ్యులు కొత్తగూడెం నియోజక వర్గం కూనంనేని సంభాశివరావు కు హుజురాబాద్ నియో జకవర్గం బేడ బుడగ జంగాల కాలనీ లో సీసీ రోడ్లు డ్రైనే జీ ఇందిరమ్మ ఇండ్లు స్మశాన వాటికలు కమిటీ హాళ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని సాంబశివ రావు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వారు కూడా సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎస్సీ 57 ఉప కులాల అకుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు.ఉపాధ్యక్షులు తూర్పాటి లింగయ్య,ప్రధాన కార్యదర్శి కానుకుర్తి, రాజేష్. కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి, తురుపాటి రాజు మంత్రి.తురుపాటి సాయి తదితరులు పాల్గొన్నారు.










