కోల్ కతాలో జూనియర డాక్టర్ పై జరిగిన అత్యాచారం,హత్యను ఖండించండి. … జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సమత కమిటీ కన్వీనర్ వెలిదండి సుమలత.

బాహుబలం న్యూస్ హన్మకొండ ఆగస్టు 19:
నయింనగర్:పశ్చిమ బెంగాల్ కోల్ కతాలో జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన అమానవీయ సంఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.జరిగిన అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జన వేదిక రాష్ట్ర సమతా కమిటీ కన్వీనర్ వెలిదండి సుమలత. మానవ సమాజం మొత్తం ముక్త కంఠంతోఈ సంఘటనను తీవ్రంగా ఖండించాలని అన్నారు. వైద్య కళాశాల ఆసుపత్రి లో 31 ఏళ్ల ట్రైని డాక్టర్ దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్న తీరు సక్రమంగా లేదని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్నారు.ఈ సంఘటన లో నిందితుడు ఒక్కడే కాదని సంబంధిత అధికారుల మద్దతుతో భారీ స్కెచ్ వేసి ప్లాను ప్రకారంగా వారి ప్రమే యంతోనే జరిగివుంటుందని జరిగిన ఘోరమైన సంఘట నను చూస్తే అర్ధం అవుతుందన్నారు.నిందితులు ఎంత పలుకుబడి వున్న వారైనప్పటికి వదిలిపెట్టకుండా,చట్ట పరంగా కఠినంగా శిక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు.అనాగరిక సమాజంలో కూడా మహిళపట్ల ఇంత చులకన భావం కనిపించలేదు. మను షుల పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవ హరించలేదని చరిత్ర చెపుతున్నప్పటికి, నాగరిక సమాజం లో ఉండీ కూడా,స్త్రీలను అమ్మగా,చెల్లిగా, మన ఇంటి బిడ్డగా చూడకుండా,మహిళలను చెరచడం, హత్యలు చేయడం ఎంత అన్యాయం అన్నారు.కోల్ కత్తా లో ఆర్ జీ కార్ మెడికల్ హాస్పిటల్ లోనే కాదు ఇంతకుముందు దేశంలో అనేక ప్రాంతాలలో మహిళలపై దారుణాలు జరిగాయి కానీ,పాలకులు వీటిని నివారించడంలో,నింది తులను శిక్షించడంలో పూర్తిగా,ఘోరంగా వైఫల్యం చెందు తున్నారు. దాని ఫలితమే నేడు కోల్ కతాలో వైద్య వృత్తిలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఒక యంగ్ మెడికోను దేశం కోల్పోయింది.స్త్రీలపై,సామాన్య,మద్య తరగతి,రైతు కూలీలపై చివరికి వృద్దులు,పసిపిల్లలను చెరబడితే పట్టిం చుకోకుండా, జరిగిన ఘటనలపై ఏమాత్రం స్పందించకుం డా ఉండడం మూలం గానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి దారుణమైన సంఘటనలకు పాలకులే పూర్తి బాధ్యత వహించాలి.నేడు కోల్ కత్తా లో రేపు ఇంకోకాడ ఇలాంటి ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దోషులను త్వరగా గుర్తించి సత్వర న్యాయం జరిగేలా కోర్టులు సరి యైన సూచనలు చేయాలని కోరారు.కోల్ కతా సంఘటన పై నిజాయితీ పరులైన ఉన్నతాధికారుల చేత విచారణ జరపాలని,కోల్ కత్తా అత్యాచారం,హత్య ఘటనలో ఎంత మంది దోషులు ఉన్నారో తేల్చి వారిని కఠినంగా శిక్షించి మౌమిత కుటుంబానికి న్యాయం చేయాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తుందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….