డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలపై యువతకు పట్టణ సీఐ అవగాహన!

Venkataswamy sabbani బాహు బలం ప్రతినిధి
హుజురాబాద్ ఆగస్టు 18;
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో డ్రగ్స్,సైబర్ నేరాలు,గురించి పట్టణ సిఐ తిరుమల్ అవగాహన కార్య క్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టౌన్ సీఐ తిరుమల్ మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి లాంటి మత్తు పదార్థాలు దరిదాపుల్లోకి రానివద్దని యువతను కోరారు.ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు సర్వనాశనం అవుతా యన్నారు.అలాగే విరివిగా సెల్ఫోన్ లను వాడుతూ వచ్చిన ప్రతి మెసేజ్ లను నొక్కినట్లయితే సైబర్ నేరగాళ్ల వల లో చిక్కినట్లేనని సూచించారు.ఏదైనా సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని సైబర్ క్రై పోలీసులకు సమాచారం ఇస్తే పెద్దగా నష్టపోకుండా కాపాడుతారన్నారు.ఆన్లైన్లో గేములకు యువత దూరంగా ఉంటూ యువత చదువుకుంటూ మంచి ఉద్యోగం సంపాదిం చాలని ఈ సందర్భంగా పట్టణ సిఐ తిరుమల్ యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ వంగ రాములు గౌడ్,గ్రామస్తులు,యువకులు,మహిళలు, తదితరులుపాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !